సెల్ఫీ తీసుకుంటూ.. ప్రేమజంట మృతి..!

సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో జారిపడి ఓ ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటక రాష్ట్రం బీదర్ లోని పురుషోత్తమ్ పాటిల్, రక్షిత ఇద్దరు ప్రేమికులు.. పురుషోత్తమ్ కర్ణాటక కాలేజ్ లో బీఏ చదువుతుండగా, రక్షిత గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదివేది.. వరుస సెలవులు కావడంతో వీరిద్దరు కలిసి విహార యాత్రకు వెళ్లారు..

సోమవారం జోయిడా ప్రాంతంలోని అంబికానగర్ గణేశ గుడి సమీపంలోని వంతెన వద్ద నిల్చొని సెల్పీ తీసుకుంటుండగా.. జారి వంతెన పై నుంచి కాళీ నదిలోకి పడిపోయారు. ఈత రాకపోవడంతో వీరిద్దరు నీటిలో మునిగిపోయారు. వంతెనపై దొరికిన మొబైల్ పోన్ ఆధారంగా యువతి కుటుంబ సభ్యులకు కొందరు సమాచారం అందించారు. 

మంగళవారం ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. బీదర్ జిల్లా రామనగర పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా వీరు నిజంగానే ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అని స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Leave a Comment