రూ.10 నోటుపై ప్రేమ రాయబారం.. ‘ఏప్రిల్ 26న నా పెళ్లి.. విశాల్ నన్ను తీసుకెళ్లు’ అంటూ..!

పాతకాలంలో పావురాలతో సందేశాలు పంపించేవారు.. తర్వాత పోస్ట్ కార్డుల ద్వారా సమాచారాలు చేరవేసేవారు.. కాలం మారిపోయింది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. లవ్ ప్రపోజల్ నుంచి పెళ్లి వరకు అంతా ఫోన్లలో జరుగుతున్నాయి. ఈక్రమంలో ఓ ప్రియురాలు తన ప్రియుడికి రూ.10 కరెన్సీ నోట్ పై రాయబారం పంపింది. ప్రస్తతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఓ పది రూపాయల నోటుపై.. ‘విశాల్ ఏప్రిల్ 26న నా పెళ్లి ఉంది. నన్ను తీసుకెళ్లు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కుసుమ్’ అని ఆ కరెన్సీ నోటుపై రాసి ఉంది. ఈ కరెన్సీ నోటును ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. ఏప్రిల్ 26వ తేదీలోపు కుసుమ్ సందేశాన్ని అతడి ప్రియుడికి చేరవేయాలని, అతనికి చేరే వరకు షేర్ చేయాలని రాసుకొచ్చాడు. 

ప్రేమికుల విషయం కావడంతో.. వారిని కలిపేందుకు నెటిజన్లు అందరూ ఏకమయ్యారు. ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. వారిద్దరినీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది నిజంగానే రాశారా.. లేదా ఎవరైనా సరదాగా రాశారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.  

 

 

 

 

Leave a Comment