ఏప్రిల్, మే నెలల్లో స్థానిక ఎన్నికలు : విజయసాయిరెడ్డి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలు పూర్తయ్యాక ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు ఉన్న ఆయన బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

ఉత్తరాంధ్రలో జులై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. త్వరలో 13 జిల్లాల్లో పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ పరంగా ప్రస్తుతం ఉన్న కమిటీలు రద్దు అవుతాయని, ప్లీనరీలో పునర్నియామకాలు ఉంటాయని వెల్లడించారు. 

అన్ని కులలు, మతాలను సమానంగా చూడాలనేదే సీఎం జగన్ అభిమతమన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు కలిసి ఇప్పుడు దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. వాటిని తమపై రుద్దుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చేందుకు త్వరలో ఉద్యోగమేళా నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.   

Leave a Comment