బాబోయ్.. బావర్చీ బిర్యానీలో బల్లి.. సగం తిన్నాక షాక్ అయిన కస్టమర్..!

హైదరాబాద్ బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకొని తింటారు.. అందులోనూ బావర్చి బిర్యానీ అంటే ఎంత ఫేమసో తెలిసిందే.. తాజాగా బావర్చి బిర్యానీ తిన్న కష్టమర్ కంగుతిన్నాల్సి వచ్చింది. సగం బిర్యానీ తిన్నాక.. ప్లేట్ లో బల్లి కనిపించింది. ఇంకేముంది.. యాక్ అనుకుంటూ వాంతి చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న బావర్చీ రెస్టారెంట్ లో వెలుగు చూసింది. 

రామ్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చీ రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేశాడు. సగం బిర్యానీ తిన్నాక అందులో బల్లి కనిపించింది. దీంతో కార్పొరేటర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అతడికి వాంతులు అయ్యాయి. 

ఆ తర్వాత కార్పొరేట్ రవిచారి చిక్కడపల్లి పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్ కి పంపారు. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: కూల్ డ్రింక్ లో బల్లి..  

 

 

 

Leave a Comment