మనవడా.. నీ తల్లిని ఎంత నీచంగా చూశారో.. నీకు తెలియదురా..!

ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన అవమానంపై నిన్న జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడడం అరాచక పాలనకు నాంది పలుకుతుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఈమేరకు ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ పై దివంగత ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. ‘మనవడా జూనియర్ ఎన్టీఆర్.. నీకు గుర్తుందా మీ అమ్మను ఎంత హీనంగా చూసిందో ఈ కుటుంబం.. నువ్వు చిన్న పిల్లాడివి.. నిన్ను తీసుకుని మీ అమ్మ గ్రౌండ్ కి వెళ్తే.. అక్కడ ఈ కుటుంబం మిమ్మల్ని దూరంగా.. అంటరాని వారిలాగా చూసింది. మీ అమ్మ ఎన్ని అవమానాలు పడిందో.. మీ అమ్మను అడుగు తెలుస్తుంది.. తర్వాత నువ్వు పెద్ద హీరో అయ్యాక నిన్ను దగ్గరికి తీసుకున్నారు.. అందువల్ల నువ్వు కూడా తొందరపడవద్దు..’ 

‘సీఎం జగన్ పార్టీలో ఎంత క్రమ శిక్షణగా ఉంటారో మీ తెలియందా ఎన్టీఆర్ బాబు.. జగన్ ఏనాడో స్త్రీల జోలికి రాలేదు. మీరు కూడా ఆ విధంగా మాట్లాడి మీ విలువను పోగొట్టుకోవద్దు.. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. అసెంబ్లీలో ఎక్కడా భువనేశ్వరి ప్రస్తావన రాకపోయినప్పటికీ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుని మోసం చేస్తున్నారు. ఇవేవి గుర్తించకుండా నేటికీ బాబు ట్రాప్ లో పడి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మోసపోతుండటం బాధాకరం.’ అంటూ లక్ష్మీ పార్వితీ పేర్కొన్నారు. 

Leave a Comment