సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహం ఆవిష్కరించిన కేటీఆర్..!

గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులకు మధ్య ఘర్షణ జరిగి నేటితో ఏడాది అయింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన భారత బృందానికి తెలుగు వాడైన కల్నల్ సంతోష్ బాబు సారధ్యం వహించారు. ఆ ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే..

కల్నల్ సంతోష్ బాబు అమరత్వానికి ప్రతీకగా సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన 9 అడుగుల క్యాంస విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా నమకరణ చేశారు. సంతోష్ బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

Leave a Comment