కింగ్స్ పంజాబ్ పేరు మారింది..!

ఐపీఎల్ 2021 సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొత్త పేరుతో బరిలోకి దిగనుంది. ఈ సీజన్ లో పంజాబ్ పేరును ‘పంజాబ్ కింగ్స్’ గా మార్చినట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ వెల్లడించింది. పేరులో మార్పును కోరుతూ తాము బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. 

పేరు మార్పుకు బోర్డు కూడా అనుమతి ఇచ్చినట్లు సమచారం. అయితే యాజమాన్యం కాని, ఫ్రాంచైజీ అధికారులు కానీ పేరు మార్పు వెనక ఉన్న కారణాలను వెల్లడించలేదు. మరో రెండె రోజుల్లో రీ-లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలిసింది. 

ఈనెల 18న జరగనున్న వేలంలో పంజాబ్ కింగ్స్ పేరుతోనే పాల్గొననున్నట్లు చెబెతున్నారు. కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి ఈ టోర్నీలో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. టీమ్ పేరు మార్పుతోనైనా పంజాబ్ తలరాత మారుతుందేమో వేచి చూడాలి..

Leave a Comment