‘కేజీఎఫ్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్..

కేజీఎఫ్ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా..ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి తరువాత అంతటి క్రేజ్ వచ్చిన చిత్రం కేజీఎఫ్. కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ 2’ చిత్నానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబరు 23న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

కేజీఎఫ్ కు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి కనిపించనుంది. సంజయ్ దత్ విలన్ గా కనిపిస్తుండగా..రావు రమేష్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బన్రూర్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని ప్రశాంత్ కిర్గందర్ నిర్మిస్తున్నారు. భారీ క్రేజ్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అటు శాండిల్వుడ్ తో పాటు మిగిలిన మిగిలిని ఇండస్ట్రీస్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ మొదటి భాగం భారతదేశ వ్యాప్తంగా ఆకట్టుకోవడంతో..రెండో భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Leave a Comment