ఇప్పుడు దక్షిణాదిపై‘ఆప్’ ఫోకస్.. తెలంగాణలో పాదయాత్రకు రెడీ అవుతున్న కేజ్రీవాల్..!

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి జోరుమీద ఉంది. ఇప్పుడు దక్షిణాదిలో పార్టీని విస్తరించాలని భావిస్తోంది.. ముందుగా తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.. వచ్చే నెలలో కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని  పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపాయి. 

తెలంగాణ యువతతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అధికారులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్రాలు చేస్తోంది. దీని కోసం తెలంగాణా సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

ఆప్ తెలంగాణ ఇన్ ఛార్జ్ గా సోమనాథ్ భారతిని నియమించారు. త్వరలోనే ఆయన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర ఏర్పాట్లు చూడనున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో ఆప్ దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. 

 

Leave a Comment