దళితుడితో మూత్రం తాగించిన ఎస్సై..!

దళిత యువకుడిని కొట్టి, మూత్రం తాగించాడు చిక్కమగళూరు జిల్లా గొణిబీడు పోలీస్ స్టేషన్ ఎస్సై.. దీంతో ఎస్సై అర్జున్ పై కేసు నమోదైంది. కిరగుంద గ్రామానికి చెందిన పునీత్ అనే యువకుడు ఒక వివాహితతో మాట్లాడడం వల్ల వారి సంసారంలో విభేదాలు వచ్చాయి. ఆ మహిళ భర్త ద్వారా ఈ సంగతి ఎస్సైకి తెలిసింది. దీంతో పునీత్ ను స్టేషన్ కు పిలిపించాడు. అతడిని కులం పేరుతో దూషించడంతో పాటు మూత్రం తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆ ఎస్సైపై చర్యలు ప్రారంభించారు..

పోలీస్ స్టేషన్ లో ఎస్సై తనను ఇష్టానుసారంగా కొట్టాడని పునీత్ తెలిపాడు. లాక్ డౌన్ కారణంగా తన కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదన్నాడు. తీవ్రంగా కొట్టడం వల్ల నేలపై మూత్రం కారిందని, దానిని నాలుకతో నాకించాడని పేర్కొన్నాడు. అతను చెప్పిన పని చేసినప్పటికీ ఇంటికి పంపించలేదన్నాడు. తనపై ఎవరూ కేసు పెట్టలేదని, ఎవరి మాటలో విని ఎస్సై నీచంగా ప్రవర్తించాడని, చేతులు కాళ్లు కట్టేసి మోకాళ్లు, చేతులపై కొట్టాడని వాపోయాడు.. ఈ వ్యవహారంపై దళిత సంఘాలతో కలిసి చిక్కమగళూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై అర్జున్ ను బదిలీ చేశారు.. ఎస్సైపై వివిధ నేరాభియోగాలను నమోదు చేశారు.

Leave a Comment