ప్రేయసి కోసం చేసిన ఖర్చులు వసూలు చేయాలని లెక్కరాసి.. యువకుడు ఆత్మహత్య..!

ఇటీవల ప్రేమ వివాహాలు విఫలమై లవర్స్ ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు చూస్తునే ఉన్నాం.. పెళ్లికి పెద్దలు నో చెప్పారని ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ప్రేమలో ఉన్నప్పుడు ప్రేయసి సంతోషం కోసం చాలా మంది ఖర్చు చేస్తుంటారు. ఈ ప్రియుడు మాత్రం అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని.. ఆమె కోసం ఖర్చు చేసిన వాటికి లెక్కరాసి.. వాటిని వసూలు చేయాలని లేఖరాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

చిక్ మంగళూరు జిల్లా శంకరపురకు చెందిన చేతన్(31) అనే యువకుడు తొమ్మిదేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి బయట షికార్లు చేసేవారు. ఇక ప్రేయసి సరదాలు, సంతోషాల కోసం ఈ యువకుడు బాగానే ఖర్చు చేశాడు. ఆమె కోసం ఖర్చు బాగా చేయాల్సి వస్తోందని తన స్నేహితులతో చెప్పుకునేవాడు.

చేతన్ సరకు రవాణా వాహనాన్ని నడిపేవాడు. తన ఆదాయంలో అధిక భాగం తన ప్రేయసి కోసమే ఖర్చు చేసేవాడట. ఇటీవల పెళ్లి చేసుకుందామని తన ప్రేయసిని అడిగాడు. అయితే ఇన్నాళ్లు కలిసి తిరిగిన ఆ యువతి పెళ్లికి మాత్రం నో చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన చేతన్ సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. 

చేతన ఆత్మహత్య చేసుకునే సమయంలో ఓ సూసైడ్ నోట్ రాశాడు. ఆ నోట్ లో తన ప్రేయసి సరదాల కోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశానని పేర్కొన్నాడు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేయాలని, ఆ డబ్బులను తన కుటుంబ సభ్యులకు అందించాలని ఆ లేఖలో పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.    

Leave a Comment