పుట్టింటికి వచ్చిన చెల్లిని చంపి.. పోలీస్ స్టేషన్ కి వెళ్లి..!

చిన్న గొడవ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. అన్నాచెల్లెళ్ల బంధాన్ని రక్తసిక్తం చేసింది. రాఖీ కట్టించుకుని రక్ష అందిస్తాడనుకున్న అన్న ఆ చెల్లి పాలిట యముడయ్యాడు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లిని హతమార్చి.. ఆపై పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

హుబ్లీ జిల్లాలోని నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి చెల్లి శశికళ సుణగార ఇటీవల పుట్టింటికి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఓ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో మహంతేష్ తన చెల్లిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం కత్తితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు. 

 

Leave a Comment