రంగంలో కేఏ పాల్.. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని దీక్ష..!

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన దీక్ష చేపట్టారు. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు పెట్టడం సరికాదని కేఏ పాల్ పేర్కొన్నారు. పరీక్షలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

సీఎం జగన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తానని చెప్పే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. 35 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానన్నారు. విద్యార్థుల పరీక్షల అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తాను దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రానుందని చెప్పారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Leave a Comment