‘రాజమౌళి నన్ను అసహ్యంగా ఉన్నావు అన్నారు’.. ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెర రియాల్టీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే రియాల్టీ షోకు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.. ‘మీలో ఎవరు కోటీశ్వరులు షో ఇటీవల స్టార్ట్ అయింది. ఈ షోలో పాల్గొన్న ఓ కంటెస్ట్ తో ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇటీవల తనకు క్రికెట్ చూడాలన్న ఆసక్తి మొదలైందని, అందుకు తన తండ్రి హరికృష్ణ కారణమని చెప్పారు. తనను చూసి రాజమౌళి అసహ్యించుకున్నారని ఆసక్తికర విషయాలను ఈ షోలో బయటపెట్టారు. 

ఇదంతా ఎందుకు చెప్పారంటే.. ఈ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ తనకు బట్టతల ఉందని, దీంతో ఆత్మన్యూనత భావానికి గుర్యయ్యేవాడినని, తనను చూసి అందరూ నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఎక్కువగా బాధపడేవాడినని తెలిపాడు. ఆ కంటెస్టెంట్ వ్యాఖ్యలకు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఇలా అన్నారు..

తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటిందని, ఫస్ట్ లో  చాలా బొద్దుగా ఉండేవాడినని అన్నారు. అయితే తాను ఏనాడు అలా  ఫీల్ అవ్వలేదన్నారు. ఒకరోజూ రాజమౌళి తనను చూసి అసహ్యంగా ఉన్నావన్నారు. ఆ రోజు తనకు ఓ విషయం అర్థమైందని, తమ చుట్టు ఉన్న వారే తమను మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. అలాంటి వారే మనకు నిజమైన స్నేహితులన్నారు. ఓ రోజు నుంచి తాను జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని, అన్నారు. మీది జుట్టు ప్రాబ్లమ్.. తనది కొవ్వు ప్రాబ్లమ్.. అంతే తేడా అని ఎన్టీఆర్ ఈ షోలో చెప్పుకొచ్చారు.  

Leave a Comment