ఏపీలో టికెట్ రేట్ల విషయంలో.. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటారా..!

దర్శకుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఆర్ఆర్ఆర్ టీం మాత్రం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. డిసెంబర్ 9న విడుదలైన ట్రైలర్ రికార్డు క్రియేట్ చేస్తోంది. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. 

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు. విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు మూవీ యూనిట్ సమాధానాలు చెప్పింది. ఈక్రమంలో ఓ విలేకరి నిర్మాత దానయ్యను ఓ ప్రశ్న అడిగారు. ‘ఏపీలో టికెట్ల ధరల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి కదా.. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ వల్లభనేని వంశీ, కొడాలి నాని హెల్ప్ ఏమైనా తీసుకుంటారా?’ అని అడిగారు. ఈ ప్రశ్నకు చిత్రం యూనిట్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ ప్రశ్న వినగానే ఎన్టీఆర్ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయింది. కొంతసేపు అలానే సీరియస్ మూడ్ లో ఉన్నారు ఎన్టీఆర్.. 

ఇక ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు దానయ్య సమాధానం చెబుతూ.. ఏపీ ప్రభుత్వం టెక్కట్ల ధరలు తగ్గించిందని, అది ఏ పెద్ద సినిమాకు కూడా వర్క్ ఔట్ కాదని చెప్పారు. తాము ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నామని, ప్రభుత్వం కూడా పాజిటివ్ గా స్పందిస్తుందని తెలిపారు.  

 

 

Leave a Comment