వైసీపీ కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పార్టీ కోసం పనిచేసిన వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంకల్పించింది. ఈమేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్ మేళా వెబ్ సైట్ ను ప్రారంభించింది. వైసీపీ కార్యకర్తల కోసమే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రైవేట్ కంపెనీల్లో వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16, 17 తేదీల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో, ఈనెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో, ఈనెల 30, మే 1వ తేదీల్లో గుంటూరులో వైసీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టెన్త్ నుంచి పీహెచ్ డీ వరకు చదివిన వారు అప్లయి చేసుకోవచ్చని తెలిపారు. తొలి విడతలో కనీసంగా 15 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని, అవి 20 వేలు కూడా కావచ్చని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- అర్హులైన వైసీపీ కార్యకర్తలు https://ysrcpjobmela.com/ వెబ్ సైట్ ని సందర్శించి రిజిస్టర్ చేసుకోవాలి.
- జాబ్ మేళాకు హాజరయ్యే వారు రిజిస్టర్ చేసుకున్న కాపీతో పాటు రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లతో రావాల్సి ఉంటుంది.
- తిరుపతి జాబ్ మేళాకు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన నిరుద్యోగులు హాజరు కావచ్చు.
- విశాఖ జాబ్ మేళాకు తూర్పు గోదావరి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నిరుద్యోగులు హాజరు కావచ్చు.
- గుంటూరు జాబ్ మేళాకు గుంటూరు, క్రిష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగులు హాజరు కావచ్చు.