కిరాణ, నిత్యావసర వస్తువులను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ‘జియోమార్ట్’ సేవలను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 200 నగరాల్లో జియోమార్ట్ సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలో జియో మార్ట్ సేవలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. ‘ఎక్ట్సెండెడ్ బీటా వెర్షన్’ కింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 30 నగరాల్లో జియోమార్ట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఈ 30 నగరాల్లో ప్రజలు కిరాణ సరకులను జియో మార్ట్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇంకో విశేషం ఏంటంటే జియో మార్ట్ వినియోగదారులకు ఉత్పత్తులను ఎంఆర్పీ కంటే 5శాతం తక్కువ ధరకే అందజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో జియోమార్ట్ సేవలు..
- విజయవాడ, వైజాగ్, రాజమహేంద్రవరం, చిత్తూరు, తిరుపతి, గుంటూరు, తాడేపల్లిగూడెం, విజయనగరం, నరసరావుపేట, భీమవరం, కర్నూలు, తణుకు, వినుకొండ, ఉయ్యూరు, అనంతపురం, కాకినాడ.
తెలంగాణాలో జియో మార్ట్ సేవలు..
- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, సిద్ధిపేట, బోధన్, పాల్వంచ, మిర్యాలగూడ, మెదక్, సంగారెడ్డి.