ఒకే ఓవర్లో 37 పరుగులు.. జడేజా వీరవిహారం..!

ఐపీఎల్ 2021 ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా వీరవిహారం చేశాడు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డు అందుకున్నాడు. 2011లో గేల్ నమోదు చేసిన రికార్డును జడేజా సమం చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో ఏకంగా 37 పరుగులు దండుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. పైగా హర్షల్ ఒక నోబాల్ కూడా వేయడంతో చివరి ఓవర్ లో 37 పరుగులు వచ్చాయి. జడేజా కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు.

కాగా మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్లలో ఫాఫ్ డుప్లెసిస్ 50 పరుగులతో అదరగొట్టగా రుతురాజ్ గైక్వాడ్(33)తో రాణించాడు.  రైనా (24), అంబటి రాయుడు 14 పరుగులతో రాణించారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చహల్ ఒక వికెట్ తీశాడు.. 

Leave a Comment