సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్..!

ఐపీఎల్ 14 సీజన్ కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదాపడిన విషయం తెలిసిందే.. అయితే ఐపీఎల్ 2021 ను మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే భారత్ లో కరోనా ఉధృతి తగ్గని కారణంగా ఈ సీజన్ లో జరగాల్సిన మిగితా 31 మ్యాచ్ లను దుబాయ్, అబుదాబి, షార్జాలో నిర్వహిస్తామని వెల్లడించింది. 

ఇక ఫైన్ మ్యాచ్ ను అక్టోబర్ 15న నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా, మిగితా ఐపీఎల్ మ్యాచ్ లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అంశంపై సందిగ్దత నెలకొంది. అయితే విదేశీ ఆటగాళ్లు వచ్చినా, రాకపోయినా లీగ్ ను మాత్రం కొనసాగిస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇటీవల తెలిపారు. 

Leave a Comment