IPL 2021: ఐపీఎల్ నిరవధిక వాయిదా..!

ఐపీఎల్ 2021 విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లు వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. ఇప్పటికే కోల్ కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా సోకడంతో సోమవారం జరగాల్సిన కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ వాయిదా పడింది..

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రాకు కరోనా పాటిటివ్ వచ్చింది. దీంతో బయోబబుల్ లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 

 

Leave a Comment