ఐపీఎల్-2021 షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9 నుంచి మ్యాచులు.. !

ఐపీఎల్-2021 షెడ్యూల్ ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, మే 30న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్ కతా వేదికల్లో టోర్ని జరగనుంది. 

ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య నిర్వహించనున్నారు. ఇక ఈ ఐపీఎల్ మ్యాచులన్నీ ప్రేక్షకులు లేకుండానే జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ లు 3.30 గంటల నుంచి ఆరంభం కాగా, రాత్రి మ్యాచ్ లు 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. 

కాగా, ఈ సారి హైదరాబాద్ కు మాత్రం నిరాశే ఎదురైంది. హైదరాబాద్ లో మ్యాచ్ లు జరగాలని మంత్రి కేటీఆర్ కోరినా బీసీసీఐ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే అన్ని జట్లు తటస్థ వేదికల్లోనే మ్యాచ్ లు ఆడనున్నాయి. ఏ టీమ్ కూడా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడబోవడం లేదు.    

Leave a Comment