విదేశాల్లో చదవాలనుకునేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులు ఆర్థిక సహాయం పొందవచ్చు.. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది.. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థల్లో సీటు సాధిస్తే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగిన వాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం చెల్లిస్తుంది.
పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థుల ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు అందరూ ఈ పథకానికి అర్హులు. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్ల్లో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సుకు నీట్లో అర్హత సాధించి ఉండాలి. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.