సుప్రీం తీర్పులకు విశేష స్పందన – మోడీ

భారతదేశ న్యాయ వ్యవస్థ అ్యతున్నతమైందని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. శనివారం ఢిల్లీలోని సుప్రీం కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ ఎంతగానో క్రుషి చేస్తుందని అన్నారు. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను 130 కోట్ల మంది భారతీయులు స్వాగతించారన్నారు. మహాత్మగాంధీ న్యాయవాధి, గాంధీ ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారన్నారు. మహాత్మగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారన్నారు. గాంధీజీ తన ఆత్మకథలో, తన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాశరన్నారు. 

నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చని, వ్యవస్థలో మార్పులు హేతుబద్ధంగా, చట్ట ప్రకారం ఉండాలని సూచించారు. భారత దేశ శాసన, న్యాయశాఖలు పరస్పరం గౌరవించుకుంటాయన్నారు. 70 ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళలకు  సముచిత ప్రాధాన్యం కల్పించామని, మహిళలకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్ ఒకటి అని మోడీ తెలిపారు. 135 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థ ద్వారానే పరిష్కరించుకుంటున్నారని చెప్పారు. లింగ సమానత్వం లేనిది సంపూర్ణ వికాసం ఉండదన్నారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కేవలం లాయర్ల డాక్యుమెంట్ మాత్రమే కాదని, అది అందరి జీవితాలను మార్గదర్శకమని అన్నారు. దేశంలో పర్యావరణ పరిరక్షణకు సుప్రీం తన తీర్పులతో ఎంతో సహకరించిందన్నారు. మారుతున్న సాంకేతికతను న్యాయవ్యవస్థ అందిపుచ్చకోవాలని మోడీ వ్యాఖ్యానించారు. 

Leave a Comment