దళిత విద్యార్థికి అవమానం.. నాలుకతో పాదాలు నాకించారు..

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దారుణం జరిగింది. ఓ దళిత విద్యార్థిపై దాడి చేసి అతని చేత కాళ్లు నాకించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆ దళిత మైనర్ బాలుడు చెవులు పట్టుకుని నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.  

ఈ ఘటన ఏప్రిల్ 10న జరిగింది. బాధితులు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పలువురు అగ్రవర్ణాలకు చెందిన వారిగా తెలిసింది.

దళిత విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. అతడి తల్లి పొలం పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఓ అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి పొలంలో పని తాలూకూ డబ్బును అడిగేందుకు వెళ్లిన దళిత విద్యార్థిపై దాడి జరిగింది. అక్కడ ఉన్న వారు తమ పాదాలను బాలుడి నాలుకతో నాకించి అవమానించారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. 

Leave a Comment