టోక్యో ఒలింపిక్స్: హాకీలో ఇండియా బోణీ..న్యూజిలాండ్ పై విజయం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు బోణీ కొట్టింది. న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 3-2తో విజయం సాధించింది. రెండు గోల్స్ తో హర్మన్ ప్రీత్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

తొలి క్వార్టర్ చివరి వరకు 1-0తో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ డిఫెన్స్ కు బ్రేక్ చేసి భారత ఆటగాళ్లు తొలి క్వార్టర్స్ చివరన గోల్ ని సాధించి స్కోర్ ను 1-1తో సమం చేశారు. ఆ వెంటనే హర్మన్ ప్రీత్ మరో గోల్ చేసి లీడ్ ను 2-1కి పెంచాడు.  ఇక రెండో క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ ప్రీత్ కొట్టిన గోల్ తో భారత 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

ఇక మూడో క్వార్టర్ చివరి నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ స్టీఫెన్ జెన్నెస్ గోల్ తో టీమిండియా టీడ్ ను 3-2కి తగ్గించాడు. చివరి క్వార్టర్ లో ఇండియా స్కోరును సమం చేయడానికి న్యూజిలాండ్ ప్రయత్నించినా భారత ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. భారత జట్టు తమ రెండో మ్యాచ్ జూలై 25న ఆస్ట్రేలియాతో తలపడనుంది.  

Leave a Comment