డేటాకు పెరిగిన డిమాండ్…

కరోనా ప్రభావంతో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించాయి. ఇంటి నుంచే పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో డేటాకు బాగా డిమాండ్ పెరిగింది. మొత్తం ఇంటెర్నెట్ ట్రాఫిక్ 10 శాతానికి పైగా పెరిగినట్లు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా డాంగల్స్ కూ డిమాండ్ రెట్టింపు కావడంతో రిటైలర్లు స్టాక్ తెప్పించేందుకు వారం సమయం కోరుతున్నారు. ఇంటర్నెట్ ట్రాఫిక్ 10 శాతం పెరిగిందని తమ టెలికం సభ్యుల నుంచి సమాచారం అందిందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్.మ్యాథ్యూస్ వెల్లడించారు. ట్రాఫిక్ అనూహ్యంగా పెరగడంతో నెట్ వర్క్ లు స్తంభించే అవకాశం లేదని ఆయన తెలిపారు. 

డెటా డిమాండ్ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకాబోవని, నెట్ వర్క్ అన్ని తగిన సామర్థ్యంతో కూడుకుని ఉన్నాయని చెప్పారు. మరోవైపు రిలయన్స్, జియో వంటి టెలికం కంపెనీలు ప్రీపెయిడ్ కస్టమర్లకు వారి మొబైల్స్ లో డేటా కెపాసిటీని డిమాండ్ కు అనుగుణంగా పెంచుతున్నాయి. టాప్ అప్స్ కు సరికొత్త టారీఫ్ ప్యాకేజీని జియో ఇటీవల లాంచ్ చేసింది. రూ.21 టాప్ అప్ చేయిస్తే అంతకుముందు 1 జీబీ స్థానంలో 2 జీబీ డేటా, 200 నిమిషాల ఇంటర్ నెట్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక భారతీ ఎయిర్ టెల్ హోం బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు ఇంటి నుంచి పనిచేసేకునేందుకు వీలుగా వేగవంతమైన, అధిక డేటా ప్లాన్స్ ను వర్తింపజేస్తోందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 

 

Leave a Comment