గోడలో నోట్ల కట్టలు.. వెండి ఇటుకలు..!

హీరో సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలో.. ఓ రాజకీయ నాయకుడి ఇంటి గోడల్లో నోట్ల కట్టలు బయటపడతాయి.. అచ్చం అలాంటి ఘటనే ముంబాయిలో వెలుగుచూసింది. ఓ వ్యాపార సంస్థ ఆఫీస్ గోడలను, నేలను అధికారులు తవ్వి చూస్తే.. కట్టల కొద్దీ డబ్బులు, వెండి ఇటుకలు బయటపడ్డాయి.. 

మహారాష్ట్ర జీఎస్టీ అధికారులు ఇటీవల అనుమానిత కంపెనీల లావాదేవీలను పరిశీలించారు. ఈక్రమంలో చాముండా అనే వ్యాపారి టర్నోవర్ గత మూడేళ్లలో రూ.23 లక్షల నుంచి రూ.1,764 కోట్లకు పెరిగింది. దీంతో చాముండా వ్యాపార సంస్థ కార్యాలయాలపై అధికారులు దాడులు చేశారు. తొలుత కల్పాదేవీ ప్రాంతంలో ఉన్న 35 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాయలంపై దాడి చేశారు. 

ఆ కార్యాలయంలో ఏమీ దొరకలేదు. అయితే కార్యాయలంలోని టైల్స్ చూస్తే అధికారులకు అనుమానం వచ్చింది. ఒక మూలన ఉన్న టైల్స్ కొద్దిగా భిన్నంగా కనిపించింది.. వెంటనే ఆ టైల్ ని తొలగించి చూశారు.. అంతే అక్కడ నగదుతో నిండిన గోనె సంచులు బయటపడ్డాయి. జీఎస్టీ అధికారులు, ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. 

అనంతరం వారు వచ్చి గదిని పరిశీలించారు. గోడలో ఉన్న రహస్య అరను గుర్తించారు. అందులో నగదు నింపిన గోనె సంచలు బయటపడ్డాయి. కార్యాలయం నేలలో, గోడలో ఏర్పాటు చేసిన రహస్య అరల నుంచి రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Leave a Comment