7557557744 నంబర్ కు వాట్సాప్ చేస్తే రూ.10 వేలు వేస్తాం.. అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన..!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని టీడీపీ ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడకుండా టీడీపీ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వలంటీర్లు కానీ, అధికార పార్టీకి చెందిన వారు కానీ బెదిరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించింది. 

తిరుపతిలో జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొని మాట్లాడారు. వైసీపీకి ఓటెయ్యకపోతే పతకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల గుట్టరట్టు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాంటి వారి సమాచారాన్ని పార్టీకి అందించాలని ఓ వాట్సాప్ నెంబర్ ను ప్రకటించారు. వాలంటీర్లు బెదిరిస్తే కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ 7557557744 అనే నంబర్ కు వాట్సాప్ చేస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్ లో రూ.10 వేలు వేస్తామని వెల్లడించారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరికీ చేరేలా చేయాలని కోరారు. 

Leave a Comment