‘నేను డీపీ మార్చాను.. మీరు మార్చండి’.. ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా డీపీగా జాతీయ జెండా పెట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. ఆగస్టు 2 నుంచి 15వ తేదీ వరకు ప్రొఫైల్ పిక్చర్ గా త్రివర్ణ పతకాన్ని ఉంచాలని కోరారు. ఈనేపథ్యంలో ప్రధాని మోడీ తన సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్ ని మార్చారు. ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ల డీపీగా జాతీయ జెండా ఉంచారు.. 

‘ఆగస్టు 2 ప్రత్యేకమైంది. మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకను జరుపుకొంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ఈ రోజు నా సోషల్ మీడియా అకౌంట్ల డీపీలను మార్చాను. మీరు కూడా జాతీయా జెండాతో డీపీ మార్చాలని కోరుతున్నాను.’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అలాగే ఆగస్టు 13 నుంచి 15 వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు.  

Leave a Comment