గర్భంలో బిడ్డ ఆడ, మగ తెలుసుకోవడానికి భార్య కడుపును కోసిన భర్త..

సమాజం తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదాయూ జిల్లాలో జరిగింది. గర్భంలో ఉన్న బిడ్డ ఆడ లేదా మగ తెలుసుకోవడానికి తన భార్య కడుపునే కోశాడు ఓ దుర్మార్గుడు.. సివిల్స్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేక్ పూర్ లో పన్నాలాల్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అబ్బాయిలే నేనందున కొంత కాలంగా మగబిడ్డ కోసం భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఆమె మరోసారి గర్భం దాల్చింది.

 పన్నాలాల్ భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి.. అయితే పన్నాలాల్ కి ఒక అనుమానం వచ్చింది. కడుపులో ఉన్నది ఆడ బిడ్డ లేదా మగ బిడ్డనా అని.. ఈ విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో భార్య కడుపు కోశాడు.. దీంతో ఆమెకు తీవ్రరక్తస్రావమైంది. ఆమెను బరేలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. 

Leave a Comment