జగనన్న వసతి దీవెన పథకంలో డబ్బు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి..

పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న వసతి దీవెనను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ పథకంలో ఏడాదికి రూ.2.5 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున ‘వసతి దీవెన’గా వసతి, భోజన ఖర్చుల కోసం అందిస్తుంది. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద రూ.10వేలు, జులై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో రూ.10 వేలు..మొత్తంగా రూ.20 వేలు విద్యార్థుల తల్లులకు అందిస్తారు. 

ఐటీఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు అందజేస్తారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ ఈ సాయం అందిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న వసతి దీవెనను అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 

అయితే ఎవరెవరికీ ఈ డబ్బులు పడ్డాయో లేదో మెసేజ్ రూపంలో వివరాలను వారి ఫోన్ నెంబర్లకు అందించారు. మరీ మీకు ఎంత డబ్బులు పడ్డాయో మీకు వచ్చిన మెసేజ్ ద్వారా ఆన్ లైన్లో మీరే చెక్ చేసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..ముందుగా మీకు వచ్చిన మెసేజ్ లో ట్రెజరీ అకౌంట్ బిల్ నెంబర్ ఉంటుంది. దానిని గుర్తు పెట్టుకోండి.

How to Check Jagananna Vasathi Deevena Payment Satus..

  • ముందుగా CFMS వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • అక్కడ Expenditure Links అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయండి.

  • అందులో మొదటగా ఉన్న Bill Status పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీకు వేరే విండోలో మీ బిల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ కనబడుతుంది.
  • ఇక్కడ సంవత్సరం తర్వాత మీకు వచ్చిన బిల్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
  • వెంటనే మీ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. అంటే మీ అకౌంట్ ఏంటి, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది ఇవన్నీ పూర్తిగా ఉంటాయి.

ఈ విధంగా జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మీకు అమౌంట్ వచ్చిందో లేదో అన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మెసేజ్ లేదా డబ్బులు రాకపోతే అధికారులను కలిసి మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అప్డేట్ చేయించుకోండి. వచ్చే జులై లేదా ఆగస్టులో మీ పూర్తి డబ్బులు మీ అకౌంట్ లో జమ చేయబడతాయి. 

Click Here : https://cfms.ap.gov.in

Leave a Comment