సాంబారులో సగం బల్లి..మిగిలిన బల్లి ఏమైంది?

కరోనా కాలంలో బయట ఆహారం తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ కు తినేందుకు వెళ్లారు. అక్కడ దక్షిణ భారత దేశపు ప్రసిద్ధ వంటకం సాంబర్ దోశను ఆర్డర్ చేశారు. ఓ గిన్నెలో సాబంర్ మరియు దోశ వారి ముందు సర్వ్ చేయబడింది. గిన్నెలో చూస్తే షాక్..సాంబరులో చనిపోయిన బల్లి కనిపించింది. 

ఈ రెస్టారెంట్ ఢిల్లీలోని ప్రసిద్ధి చెందిన పోష్ మార్కెట్ ప్రాంతంలో ఉంది. వీకెండ్స్ లో ఈ రెస్టారెంట్ లో క్యూ ఉంటుంది. అలాంటి రెస్టారెంట్ లో తయారు చేసిన సాంబారులో బల్లి ప్రత్యక్షమవడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాంబారులో ఆ బల్లి కనిపించే సరికి వారు సగం ఆహారం కూడా తినేశారు.  అయితే సాంబారులో సగం బల్లి మాత్రమే కనిపించగా..మిగిలిన సగం బల్లి ఎక్కడికి వెళ్లింది? వేరే వారికి వెళ్లిందా? లేక తానే తిన్నానా అంటూ ఆ వ్యక్తి భయపడిపోయాడు. వెంటనే హోటల్ మేనేజర్ ను పిలిచి నిలదీశాడు. ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది. 

Leave a Comment