గుడివాడ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య.. అక్రమ సంబంధమే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్సై పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ కుమార్ తన అపార్ట్ మెంట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

విజయ్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఆయన 2012 బ్యాచ్ ఎస్సై. హానుమాన్ జంక్షన్ లో తొలి బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో నూజివీడుకు చెందిన బ్యూటీషియన్ తో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరి గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని ముసునూరు, గుడ్లవల్లేరు, మండవల్లి పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు.

 ప్రస్తుతం గుడివాడ టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా విజయ్ కుమార్ కు ఏలూరుకు చెందిన మహిళతో మూడు నెలల క్రితమే వివాహం అయింది. అయితేే భార్యను కాపురానికి తీసుకురాలేదు. అదే సమయంలో తనకు పరిచయం ఉన్న బ్యూటీషియన్ తో కలిసి గుడివాడలో నివాసముంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. బ్యూటీషియన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Leave a Comment