పెళ్లిలో వధువు కాళ్లు మొక్కిన వరుడు.. కారణం ఎంటో తెలుసా?

పెండ్లి వేడుకల్లో వధువరులే ప్రత్యేక ఆకర్షణ.. వారి మీదే అందరి దృష్టి ఉంటుంది. దండలు మార్చుకునే దగ్గర నుంచి తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం వరకు అంతా అతిధులకు ఆకట్టుకునేట్టుగా ఉంటాయి. సాధారణంగా పెళ్లిలో వధువుతో వరుడి కాళ్లు మొక్కిస్తుంటారు. తాళి కట్టినప్పుడు, అక్షింతలు వేసినప్పుడు, గౌరీ పూజ జరిగేటప్పుడు ఇలా చాలా సార్లు వధువు చేత వరుడి కాళ్లకు దండం పెట్టిస్తారు..

కానీ తాజా ఓ పెండ్లి వేడుకలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. వరుడే వధువు కాళ్లపై పడి దండం పెట్టాడు. వివాహ తంతు పూర్తయ్యాక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటున్న సమయంలో పెళ్లి కొడుకు అకస్మాత్తుగా పెళ్లి కూతురు కాళ్లపై పడ్డాడు. దీంతో వేడుకకు హాజరైన బందు మిత్రులంతా షాక్ అయ్యారు. 

అయితే ఇలా చేయడానికి ఓ కారణం ఉందంటున్నాడు వరుడు.. తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి వస్తుంది కాబట్టి ఆమె కాళ్లకు దండం పెట్టడం తన బాధ్యత అన్నాడు. తనను కన్నవాళ్లను, తోబుట్టువులను వదిలి నాకోసం, తన సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆమె కాళ్లకు దండం పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ప్రస్తుతం వధువు కాళ్లపై వరుడు పడ్డ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 

Leave a Comment