తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త జాతీయ రహదారి..!

తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి కేంద్ర రవాణ శాఖ ఆమోదం తెలిపింది. 

ఈ రహదారి నిర్మాణమైతే హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, ఆత్మకూర్, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేయనుంది. దీని కోసం ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేయనుంది. వీలైనంత త్వరగా జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 

 

Leave a Comment