SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం ఎస్బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వలను పాటించాల్సిన అవసరం లేదు. 

అదే విధంగా పొదపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. దేశంలో ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ ప్రోత్సాహక చర్యల్లో భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్బీఐ ఖాతాల్లో యావరేజ్ నెలవారీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

ఇదే కాకుండా ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. గతంలో ఎస్బీఐ సేవింగ్స్ వినియోగదారులు మెట్రో, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా రూ.3వేలు, రూ.2వేలు, రూ.1000 నెలవారీ కనీస నిల్వను ఉంచాలనే నిబంధన ఉండేది. లేదంటే పన్నలతో పాటు 5 నుంచి 15 రూపాయల వరకు జరిమానా వసూలు చేసిన విషయం తెలిసిందే..మరో వైపు ఎస్బీఐ బుధవారం ఎంసీఎల్ఆర్ రేట్లను, డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించింది.

Leave a Comment