ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి.. ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఎస్పీ బాలు 50 ఏళ్లుగా భారతీయ సినీ సంగీతాన్ని తన గళంతో శాసించారు. దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలో ఎస్పీ బాలు పేరు తెలియని వారు ఉండరు..

కాగా, ఎస్పీ బాలు అనారోగ్యం కారనంగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే..ఆయన 50 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో చివరికి ఆయన ప్రాణాలతో పోరాడి తుదిశ్వస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా అనే తేడా లేకుండా అబాలగోపాలం నివాళులర్పించారు. అంతటి మహాగాయకుడికి ప్రభుత్వం భారతరత్నతో గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 

Leave a Comment