ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టిన ప్రియురాలు..!

ఇద్దరు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రియుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు.. మరో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ప్రియురాలు అతడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన నాగార్జున, కృష్ణా జిల్లాకు చెందిన నాగజ్యోతి విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

నాగార్జున ఇటీవల విజయవాడ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు. అప్పటి నుంచి నాగజ్యోతిని దూరంగా పెట్టాడు. అంతేకాదు మరో వివాహం చేసుకునేందుకు కూడా సిద్దమయ్యాడు. నాగజ్యోతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వివాహం కోసం ఒప్పించేందుకు నాగజ్యోతి బాపట్లకు వచ్చింది. అయితే నాగార్జున కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు నాగజ్యోతి మౌనదీక్ష చేపట్టింది. తనను వివాహం చేసుకునే వరకు ఇక్కడి నుంచి కదలనని నాగజ్యోతి స్పష్టం చేసింది. 

Leave a Comment