బాలిక ప్రాణం బలిగొన్న రూపాయి నాణ్యం .

ఒక రూపాయి నాణ్యం మింగి చిన్నారి మరణించిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. మైసూరు జిల్లా హున్సుర్ తాలుక ఆయహళ్లి గ్రామానికి చెందిన ఖుషి అనే నాలుగేళ్ళ చిన్నారి ఆమె తాత కలిసి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అనుకోకుండా ఒక రూపాన్ని మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అక్కడినుంచి మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి గొంతులో ఇరుక్కు పోయిన ధాన్యాన్ని బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే చిన్నారి పరిస్థితి విషమించింది. ఆ చిన్నారికి ఊపిరి అందక చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు .

 

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు మృతితో ఆస్పత్రిలో తల్లిదండ్రులు రో ధించిన తీరు చూసేవారికి కంటతడి పెట్టింది.

Leave a Comment