మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈసారి ఎంతంటే.?

చమురు కంపెనీలు వినియోగదారులకు మరోసారి ఝలక్ ఇచ్చాయి. అక్టోబర్ నెలలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. అయితే ఊరట కలిగే అంశం ఒకటి ఉంది. ఈసారి 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే పెరిగింది. ఈ సిలిండర్ ధర రూ.45 మేర పెరిగింది. ఇకపోతే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. దీనిలో ఎలాంటి మార్పు లేదు. 

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంం వల్లే ఈ సారి కూడా సిలిండర్ ధరలు రూ.100 దాటేస్టుతందని చాలా మంది భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సిలిండర్ ధరను స్థిరంగానే కొనసాగించింది. ఇకపోతే సెప్టెంబర్ నెలలో సిలిండర్ ధర రూ.25 మేర పెరిగిన సంగంతి తెలిసిందే..   

 

Leave a Comment