పెళ్లిలో సరిపడా మద్యం పోయలేదని వరుడిని చంపిన స్నేహితులు..!

పెళ్లి అంటేనే మందు విందు ఉండాలి. అదే మందు వరుడి ప్రాణం తీసింది. పెళ్లయి 24 గంటలు గడవకముందే వరుడు దారుణ హత్యకు గురయ్యాడు.  పెళ్లిలో సరిపడా మద్యం పోయలేదని స్నేహితులే వరుడిని పొడిచి చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ పాలిముకిమ్ పూర్ గ్రామానికి చెందిన బబ్లూ(28) అనే వ్యక్తికి సోమవారం పెళ్లి జరిగింది. పెళ్లిలో స్నేహితుల కోసం బబ్లూ మందు పార్టీ పెట్టాడు. ఇక పెళ్లి తంతు ముగించుకుని తన స్నేహితుల వద్దకు వెళ్లాడు. అప్పటికే బబ్లూ స్నేహితులు ఫుల్లుగా తాగి ఉన్నారు. అయితే తమకు మద్యం సరిపోలేదని, మరింత మద్యం కావాలని బబ్లూ స్నేహితులు అడిగారు. అందుకు అతడు నిరాకరించాడు. 

దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఫుల్లుగా తాగి ఉన్న బబ్లూ ఫ్రెండ్స్ విచక్షణ కోల్పోయి కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బబ్లూ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన రామ్ ఖిలాడ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.    

Leave a Comment