కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి..!

ఇంటి బయట పార్క్ చేసిన కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మరణించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని సింగౌలి తాగ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అనిల్ త్యాగి అనే వ్యక్తికి చెందిన కారులో ఐదుగురు చిన్నారులు ఆడుకోవడానికి ఎక్కారు. 

అనంతరం కారు డోర్లు లాక్ అయిపోయాయి. దీంతో చిన్నారులు ఊపిరాడక మరణించారు. మరణించిన చిన్నారులను నియతి(8), అక్షయ్(4), వందన(4), క్రిష్ణ(7)లుగా గుర్తించారు. వీరితో పాటే కారులో ఎక్కిన శివాన్(8) మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఊపిరాడక చిన్నారులు మరణించినట్లు వెల్లడించారు. అయితే చుట్టుపక్కల వారు మాత్రం కారు ఓనర్ నిర్లక్ష్యం వల్లే పిల్లలు మరణించారని ఆరోపించారు.  

 

Leave a Comment