అక్కడ సుమలతను పడుకోబెట్టాలి.. మాజీ సీఎం కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు..!

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజీ అవుతుందని, ఆ లీకేజీని అరికట్టడానికి ఎంపీ సుమలతను అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని కుమారస్వామి విమర్శించారు.

మండ్య జిల్లాకు ఇలాంటి ఎంపీ మునుపెన్నడూ ఎన్నిక కాలేదని సుమలతపై విమర్శలు చేశారు. కేఆర్ఎస్ డ్యామ్ లీకేజీని అడ్డుకోవడానికి గేట్లకు అడ్డంగా ఎంపీని పడుకోబెట్టాలని ఎద్దేవాచేశారు. కుమార స్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమలత ఘాటుగా స్పందిచారు. మాజీ సీఎంకి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదన్నారు. ఆయన స్థాయికి దిగజారి తాను సమాధానం చెప్పలేనన్నారు. గతంలో కూడా సుమలత భర్త అంబరీష్ చనిపోయిన సమయంలో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సుమలతకు, భర్త చనిపోయాడని దిగులు కూడా లేదని, చక్కగా మేకప్ అవుతోందని వ్యాఖ్యానించారు. 

 

Leave a Comment