ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులను కూడా తీసుకోవాలని నిర్ణయిం తీసుకుంది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ఫీజులను ఏపీ ప్రభుత్వం నిర్ధారించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే మరికొన్ని కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది.
కరోనా వైద్యానికి ఫీజులు ఇలా ఉన్నాయి..
- నాన్ క్రిటికల్ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి రూ.3,250
- క్రిటికల్ కోవిడ్-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే రోజుకి రూ.5,480
- ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980
- వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి 9,580
- ఇన్ఫెక్షన్ ఉన్న వారికి వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ.6,280
- ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380