ఏపీలో బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలు

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రతిపక్షాలు, బీజేపీ నాయకులు ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు ఆలయాల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగడం పట్ల మండిపడుతున్నారు. తాజాగా బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఖజురహో అనే కంపెనీ తన బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ విషయంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘బీరుపై హిందూ దేవుళ్ల బొమ్మలా? తెలంగాణ మరియు ఆంధ్రలో వీటిని తక్షణం నిషేధించి కంపెనీలపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఇతర మతాలకు సంబంధించి ఇలా చేయగలరా? ఇప్పటికైనా హిందూ సమాజం కళ్లు తెరవాలి.’ అంటూ ట్వీట్ చేశారు. 

Leave a Comment