సాధారణంగా పొలంలో పశువులు, పక్షల నుంచి పంటను కాపాడుకునేందుకు దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. పంట చేతికొచ్చే సమయానికి పక్షలు, పశువులు తినకుండా, దిష్టి తగులకుండా పంట చేలల్లో రకరకాల దిష్టిబొమ్మలు పెడుతుంటారు. అలా ఓ రైతు చేసిన ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాకులు, ఇతర పక్షుల బెడద నుంచి తన పొలాన్ని రక్షించుకునేందుకు ఓ రైతు వినూత్న ఐడియా చేశాడు. స్ప్రింగ్ ద్వారా ఒక బొమ్మను నిరంతరం కదులుతూ ఉండేలా, పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కాకులేమోగానీ, మనుషులకు మాత్రం హార్ట్ ఎటాక్ రావడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
O bhai saheb…did Ramsay brothers create this one??! crows ka toh nahi pata, insano ka heart attack guaranteed. https://t.co/sVFpd4bxo6
— Smita Sharma (@Smita_Sharma) July 12, 2021