విశాఖకు త్వరలోనే రాజధాని : విజయసాయిరెడ్డి

విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచి పరిపాలన చేస్తామని స్పష్టం చేశారు. సీఆర్డీఏ కేసుతో రాజధాని తరలింపునకు సంబంధం లేదన్నారు. 

ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చన్నారు. పంచగ్రామాల సమస్యపై కోర్టుకు అఫిడవిట్ ఇచ్చామని, కోర్టు అనుమతి మేరకు ఇళ్ల యజమానులకు పట్టాలిస్తామని తెలిపారు. సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తామన్నారు.  

Leave a Comment