ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ : గ్రేడ్ పాయింట్లు లేకుండానే అందరూ పాస్

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మార్చి 2020 నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్ఎస్ సీ, ఓఎస్ఎస్ సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాల్ టికెట్లు పొందిన విద్యార్దులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే పాస్ చేసినట్టు వెల్లడించారు. 

 

Leave a Comment