ప్రతి రూపాయీ ప్రజల కోసమే.. ఐటీ దాడులపై స్పందించిన సోనూసూద్..!

నటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.. ఈ దాడుల్లో సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఆయన ఏర్పాటు చేసిన సూద్ ఫౌండేషన్ కు రూ.18 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని, అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సేవా కార్యక్రమాలకు వినియోగించారని అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు సోనూసూద్ ఆర్థిక లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారు.. 

ఈ ఐటీ దాడులపై సోనూసూద్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. విషయం ఏదైనా సరే సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదని, కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందని అన్నారు. దేశ ప్రజలకు తన వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాని, ప్రతి రూపాయి కూడా నిరుపేదల జీవితాల కోసం పోగు చేసిందేనని తెలిపారు. మానవ సేవ కోసం ఇప్పటికే ఎన్నో బ్రాండ్ సంస్థలను ప్రోత్సహించానని అన్నారు. గత నాలుగు రోజుల నుంచి నా అతిథులతో(ఐటీ అధికారులు) బిజీగా ఉన్నానని, దీంతో మీ సేవలో ఉండలేకపోయానని, ఇప్పుడు తిరిగి వచ్చానని సోనూసూద్ ట్వీట్టర్ లో వెల్లడించారు. 

Leave a Comment