ఓ మహిళ ప్రాణం తీసిన పానీపూరీ..!

పానీపూరీ అంటే ఇష్టం లేనివారు ఎవరుంటారు..సాయంత్రమైతే చాలు.. చాలా మంది పానీ పూరీ బండి ముందు క్యూ కడతారు.. పడిగాపులు కాసీ మరీ పానిపూరీ రుచిని ఆస్వాదిస్తారు. ఇక అమ్మాయిలకు అయితే పానీ పూరీ అంటే భలే ఇష్టంగా తింటారు.. అయితే అదే పానీపూరీ ఓ మహిళ ప్రానాలను తీసింది. పానీపూరీని గుటుక్కున మింగేయడంతో జరిగిన తొందరపాటు చర్య ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటన సుందర్ గడ్ జిల్లాలో జరిగింది. 

సఫర్ గడ్ గ్రామానికి చెందిన పూలమతి కిషాన్(30) అనే మహిళ పానీపూరీని వేగంగా తినేసింది. దీంతో అది ఆమె శ్వాసనాళంలో ఇరుక్కుపోయింది. అమె ఉక్కిరి బిక్కిరి అయి అక్కడికక్కడే కుప్పకూలింది. భర్త, కుమారుడు అమెను తొందరగా ఆస్పత్రికి తరలించారు. అప్పిటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.  

Leave a Comment